న్యూఢిల్లీ, జనవరి 24: నైపుణ్యాలు పెంచుకోవడం నేటి పోటీ ప్రపంచంలో తప్పనిసరి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ శిక్షణ సంస్థ ఇమార్టికస్ లెర్నింగ్.. ప్రొఫెషనల్స్ సామర్థ్యాన్ని విశ్లేషించి ఒక నివేదికను వెలువరించింది. దీని ప్రకారం గత ఏడాది కొత్త నైపుణ్యాలు నేర్చుకునేవారి సంఖ్య 70 శాతం పెరిగిందని వెల్లడైంది. డిజిటలైజేషన్, సైప్లె చైన్ మేనేజ్మెంట్లో ప్రతిభ కలిగి ఉండాల్సి రావడం, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఆర్థిక సేవలు, సైబర్ భద్రత వంటి కారణాల వల్ల చాలా మంది కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతుండటంతో ఈ అవసరం మరింత పెరుగుతున్నది. టైర్ 1, టైర్ 2 నగరాల్లో ఈ సంఖ్య పెరుగుతున్నదని నివేదిక తెలిపింది.