సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ)/బేగంపేట్/బంజారాహిల్స్ : ప్రజల నుంచి ఇలాంటి సహకారం కొనసాగితే కొద్దిరోజుల్లోనే కరోనా కేసులు తగ్గుముఖం పడుతాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మంగళవారం ఈస్ట్, నార్త్జోన్లలో పర్యటించి లాక్డౌన్ అమలుతీరును పరిశీలించారు. జూబ్లీహిల్స్, అంబర్పేట్లోని విశాల్ మార్కెట్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్న చెక్పోస్టుల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ లాక్డౌన్ పటిష్టంగా అమలు జరుగుతున్నదని, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ప్రతి చెక్పోస్టు వద్ద మహిళా పోలీస్ అధికారుల కోసం మొబైల్ టాయిలెట్స్ను ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేశామని వివరించారు. సోమవారం ఒక్కరోజే 8వేల లాక్డౌన్ ఉల్లంఘనల కేసులు నమోదయ్యాయని, 7వేలకు పైగా వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈస్జ్జోన్ జాయింట్ సీపీ రమేశ్రెడ్డి, నార్త్జోన్ డీసీపీ కల్మేశ్వర్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.