న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 : యూకేలో కొత్త డిజిటల్ వీసా వ్యవస్థ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. సంప్రదాయ వీసాల స్థానంలో ఈ-వీసాలను అందుబాటులోకి తెచ్చారు. యూకేకు వెళ్లే భారతీయులు ఇక మీదట ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందులో ఇమిగ్రేషన్ స్టేటస్కు సంబంధించిన షేర్ కోడ్ ఉంటుంది. దీన్ని పనిచేస్తున్న కంపెనీలు, యజమానులు తదితరు లతో పంచుకునే అవకాశం కల్పించారు. ఈ కొత్త పద్ధతిలో పేపర్ ఆధారిత వీసా స్టిక్కర్ల స్థానంలో డిజిటల్ వీసాలను అమలుజేయనున్నారు. డిజిటల్ వ్యవస్థ అయినప్పటికీ.. బయోమెట్రిక్ నమోదు కోసం వీసాదారులు దరఖాస్తు కేంద్రానికి వెళ్లాల్సిందే.