బెంగళూరు, జనవరి 23: పాస్వర్డ్ షేరింగ్ ఫీచర్కు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ స్వస్తి పలుకనుంది. ఈ ఏడాదిలోనే ఈ ఫీచర్ను ఆపేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ గతంలోనే ప్రకటించింది. తాజాగా ఈ సంస్థ కొత్త సీఈవోలు టెడ్ సరండోస్, గ్రెగ్ పీటర్స్ కూడా బ్లూమ్బర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటివరకు నెట్ఫ్లిక్స్కు డబ్బు చెల్లించకుండా వినియోగించుకుంటున్న మెజారిటీ యూజర్లు ఇక డబ్బు చెల్లించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు.
తమ నిర్ణయం కొందరు వినియోగదారులకు అసంతృప్తి కలిగించవచ్చని, కానీ పోటీని తట్టుకునేందుకు ఇది తప్పదని పేర్కొన్నారు. దీని వల్ల తమ సబ్స్ర్కైబర్ల సంఖ్య కోటిన్నర నుంచి రెండు కోట్లకు పెరుగుతుందని వారు తెలిపారు. భారత్పై తాము ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కాగా, ప్రకటనలతో కూడిన ప్లాన్ను కూడా తొలగించాలని నెట్ఫ్లిక్స్ భావిస్తున్నది.