న్యూఢిల్లీ, జూన్ 13: మ్యాగీలో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై నెస్లే ఇండియా సంస్థ శుక్రవారం స్పందించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టి పారేసింది. తాను కొన్న మ్యాగీలో పురుగులు ఉన్నాయంటూ ఓ నెటిజన్ చేసిన పోస్టుపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ నెస్లే ఇండియా నుంచి వివరణ కోరింది. నెస్లే ఇండియా.. ‘మా ఉత్పత్తులు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి.
ఆ పోస్టు చేసిన వ్యక్తి నుంచి నమూనాలు సేకరించేందుకు ప్రయత్నించాం. కానీ అతను స్పందించలేదు. ఆ బ్యాచ్కు సంబంధించిన ఉత్పత్తులన్నింటినీ టెస్టులకు పంపించగా.. ఎలాంటి ప్రమాణ లోపాలు లేవని రిపోర్టు వచ్చింది’ అంటూ నెస్లే ఇండియా కస్టమర్లకు వివరణ ఇచ్చింది.