న్యూఢిల్లీ: నీట్ పీజీ-2022 కౌన్సెలింగ్ కోసం మాప్ అప్ రౌండ్ రిజిస్ట్రేషన్ గడువును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ మంగళవారం నోటీసు జారీచేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ mcc.nic.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నవంబర్ 10 మధ్యాహ్నం 3 గంటల వరకు ఫీజు చెల్లించొచ్చు. రాత్రి 11.55 వరకు ఆప్షన్ను ఎంచుకోవచ్చు.