కేంద్ర ప్రభత్వ డాటా వెల్లడి
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పథకంలో కొత్తగా 4.9 కోట్ల మంది వినియోగదారులు చేరారు. 2017 సెప్టెంబర్ నెల నుంచి 2021 నవంబర్ నెలవరకు మొత్తం నాలుగు సంవత్సరాల రెండు నెలల వ్యవధిలో సుమారు 4.9 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఈపీఎఫ్ స్కీమ్లో చేరానని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ మేరకు కేంద్ర స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ పరిధిలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం కేవలం 2021 నవంబర్ నెలలోనే 8,27,979 మంది నూతన సబ్స్క్రైబర్లు చేరారు. గత నెలలో కూడా 8,05,015 మంది వినియోగదారులు కొత్తగా ఈపీఎఫ్ స్కీమ్లో సభ్యులుగా నమోదయ్యారు.
ఇక, 2017 సెప్టెంబర్ నుంచి 2021 నవంబర్ వరకు మొత్తం 4,88,91,927 మంది నూతన సబ్స్రైబర్లు ఈపీఎఫ్ స్కీమ్లో చేరినట్లు కేంద్ర స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటనేషన్ శాఖ తెలిపింది. ప్రావిడెంట్ ఫండ్స్ యాక్ట్-1952 ప్రకారం.. ఈపీఎఫ్ అనేది మాండేటరీ సేవింగ్స్ స్కీమ్. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతి సంస్థ ఈ స్కీమ్లో చేరవచ్చు.