VK Pandian | భువనేశ్వర్ : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయివేటు సెక్రటరీగా కొనసాగుతున్న ఐఏఎస్ ఆఫీసర్ వీకే పాండియన్ స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు వీకే పాండియ్ను వాలంటరీ రిటైర్మెంట్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తమిళనాడుకు చెందిన వీకే పాండియన్.. ఒడిశాకు కేడర్కు చెందిన 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
వీకే పాండియన్ వీఆర్ఎస్ను కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్వాగతించారు. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వీకే పాండియన్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఇక ఇప్పుడు ఆయన అధికారంగా బీజేడీలో చేరి రాజకీయాలు చేసుకుంటే సరిపోతుందన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎస్ సలుజా స్పందించారు. వీకే పాండియన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆయన వీఆర్ఎస్ ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే.. ఆలస్యమైందన్నారు. పాండియన్ రాజకీయాల్లోకి వస్తారా..? లేదంటే అతని సొంత రాష్ట్రానికి వెళ్తారా? అన్నది తమకు తెలియదన్నారు. ఒక వేళ ఆయన బీజేడీలో చేరితే.. ప్రతిపక్షాలకు మేలు జరుగుతుందని, ప్రత్యేకంగా కాంగ్రెస్కు ఎంతో సహాయం చేసిన వారవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉల్కా కూడా స్పందించారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే.. వీకే పాండియన్ సీఎం పదవి చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఒడిశాలో ఏం జరుగుతుందో అంతు చిక్కడం లేదన్నారు. కానీ ఎవర్ని ఎవరు నియంత్రిస్తున్నారో అందరికీ తెలుసు అని ఎంపీ సప్తగిరి పేర్కొన్నారు.
బీజేపీ చీఫ్ విప్ మోహన్ మాజ్హీ మాట్లాడుతూ.. ఇప్పుడు వీకే పాండియన్ బహిరంగంగా రాజకీయాలు చేసుకోవచ్చన్నారు. అతన్ని ఒడిశా ప్రజలు అంగీకరించరు అని పేర్కొన్నారు.