న్యూఢిల్లీ : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతికి నివాళిగా శనివారం దేశ వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలపై జాతీయ జెండాలను సగం వరకు కిందకు దించారు. అబే మృతికి నివాళిగా భారత్లో శనివారం రోజు సంతాపం దినం పాటించనున్నట్లు నిన్న మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అబే మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ సంతాపం తెలిపారు. జపాన్ కోసం అబే తన జీవితాన్నే అంకితం చేశారని కొనియాడారు. 2021లో కేంద్ర ప్రభుత్వం అబెకు భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్తో సత్కరించింది. భారత్లో ముంబై-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు రావటంలో షింజో అబె కీలక పాత్ర పోషించారు. జపాన్ సాంకేతికతతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అహ్మదాబాద్లో ప్రధాని మోదీ, అబె కలిసే శంకుస్థాపన చేశారు.
Delhi | National flags at Red Fort, Rashtrapati Bhavan and Parliament fly at half-mast as one-day state mourning is being observed in the country as a mark of respect to former Japanese PM Shinzo Abe who was assassinated yesterday, July 8 pic.twitter.com/4lwY9PPYn4
— ANI (@ANI) July 9, 2022