ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పోలీసులు ఇవాళ ముంబైలోని ఖార్ ఏరియాలో కునాల్ జాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్కు కునాల్ స్నేహితుడు. అయితే సుశాంత్ మరణం తర్వాత అతను పరారీలో ఉన్నాడు. గత ఏడాది జూన్ 15వ తేదీన సుశాంత్ అనుమానాస్పద రీతిలో బాంద్రాలోని తన ఫ్లాట్లో మృతిచెందిన విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణాన్ని నార్కోటిక్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుతో లింకు ఉన్న అనేక మందిని అరెస్టు చేశారు.