Raja Mircha : సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నాగాలండ్ మంత్రి తెమ్జీన్ ఇమ్నా అలాంగ్(Temjen Imna Along) ఈసారి తమ ప్రాంతంలో పండే మిర్చి గురించి హెచ్చరించాడు. తమ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు.. ‘రాజ మిర్చ'(Raja Mircha)ను తక్కువ అంచనా వేయొద్దని ఆయన సూచించారు. పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి అయిన తెమ్జీన్ తాజాగా తన ఎక్స్ పోస్ట్లో మిరపకాయల వీడియో పోస్ట్ చేశాడు.
నాగాలాండ్లో జియోలాజికల్ ఐడెంటిఫికేషన్(GI) పొందిన మిర్చి రాజ మిర్చ. దీనికే ‘నాగా కింగ్ చిల్లి’ అని పేరు. నాలుగో అర్గానిక్ నాగా చిల్లి ఉత్సవం సందర్భంగా మంత్రి తెమ్జీన్ ఇమ్నా అలాంగ్ ఈ మిర్చి ఘాటుకు మీరు ఓడిపోతారు అని పోస్ట్ పెట్టారు. ‘నా అనుభవం కొద్ది రాజ మిర్చ గురించి మీకో విషయం చెప్పాలి. మీరు దీన్ని తినలేరు. ఈ మిర్చితో మీరు రాజీ పడతారు. ఎందుకంటే.. మీరు కచ్చితంగా ఓడిపోతారు అని రాసుకొచ్చిన మంత్రి.. నాగాలాండ్కు స్వాగతం, నీళ్లు, బియ్యంతో పాటు వినయంతో రండి’ అని పోస్ట్ పెట్టారాయన.
A word of advice about Raja Mircha from someone with experience. 🌶️
You do not eat it. You negotiate with it.
And you always lose.
Welcome to Nagaland. Bring water. Bring rice. Bring humility. 🏔️ pic.twitter.com/R8LMVLMKWD
— Temjen Imna Along (@AlongImna) September 1, 2026
రాజ మిర్చ చిల్లి అనేది నాగాలాండ్లో లభించే అన్ని రకాల మిర్చిలాంటిది కాదు. స్థానిక భాషలో దీనికి ‘నాగా మిర్చ’, ‘చుడీ చిల్లి’, ‘కింగ్ ఆఫ్ చిల్లిస్’ అని పేర్లున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చిగా గుర్తింపు సాధించిన రాజ మిర్చ.. పండు వాసన కలిగి ఉంటుంది. మొగ్గదశ అనంతరం ఆకుపచ్చ నుంచి ప్రకాశవంతమైన ఎరుపు రంగుకు మారుతుందీ మిర్చి.
మామూలుగా శంఖు ఆకారంలో ఉండే దీని పైపొర ముడతలుగా ఉంటుంది. నాగాలాండ్ ప్రజలు ఈరకం మిర్చిని తరతరాలుగా సాగు చేస్తున్నారు. అక్కడి చాలా తెగలు ఆదాయం, జీవనాధారం కోసం రాజా మిర్చపైనే ఆధారపడుతాయి. 2008లో దీనికి జీఐ ట్యాగ్ వచ్చింది. ఈ రాష్ట్రం నుంచి మొట్టమొదటి జీఐ ట్యాగ్ సాధించిన మిర్చి ఇదే కావడం విశేషం.