ముంబై: ఫిల్మ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీ వల్ల కరోనా వైరస్ వ్యాపించిందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కరణ్ జోహార్ ఇవాళ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తనతో పాటు తన ఫ్యామిలీలో అందరూ కరోనా పరీక్షలో నెగటివ్గా వచ్చినట్లు ఆయన చెప్పారు. 8 మంది కలిస్తే అది పార్టీ కాదు అని, తన ఇల్లు కోవిడ్19కు హాట్స్పాట్ కాదు అని కరణ్ ఇన్స్టాలో తెలిపారు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృతా అరోరాలు కోవిడ్ పరీక్షలు పాజిటివ్గా తేలారు. అయితే వాళ్లు కరణ్ ఇచ్చిన పార్టీకి హాజరైనట్లు తెలిసింది. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. కరణ్ ఇంట్లో ఉన్నవారందరికీ కరోనా పరీక్షలు చేపట్టింది. కరణ్ ఉంటున్న బిల్డింగ్లో 40 మందికి వైరస్ పరీక్షలు చేశారు.