ఇండోర్: ముస్లిం మతానికి చెందిన ఓ యువతి.. హిందూ మతానికి చెందిన ఓ అబ్బాయి.. ఇద్దరూ డిన్నర్కు వెళ్లారు. భోజనం చేసి బైక్పై రిటర్న్ అవుతున్న సమయంలో.. ఓ గ్యాంగ్ ఆ జంటపై అటాక్(Mob Attack) చేసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది. ఆ జంటను రక్షించేందుకు ప్రయత్నించిన ఇద్దరిపై కత్తితో దాడి కూడా చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరూ ఎందుకు కలిసి వెళ్తున్నారని ఆ జంటను ఓ గ్యాంగ్ నిలదీసినట్లు పోలీసు కమీషనర్ రాజేశ్ రఘువంశీ తెలిపారు. అయితే ఇంట్లో పేరెంట్స్కు చెప్పిన తర్వాత తాము డిన్నర్కు వెళ్లినట్లు ఆ అమ్మాయి తెలిపింది. గ్యాంగ్ వ్యవహరించిన తీరును కూడా ఆమె తప్పుపట్టింది.
ఐపీసీ 307 కింద కేసు బుక్ చేశారు. ఏడుగురు నిందితుల్ని గుర్తించారు. దాంట్లో ఇద్దర్ని అరెస్టు చేసినట్లు తుకోగంజ్ పోలీసులు తెలిపారు. జంటను వేధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.
In Indore, MP MusIim mobs beat a couple because the girl was a MusIim & the boy was a Hindu.
It's becoming a new normal!
Imagine the amount of national-international outrage if any Hindu group starts doing this with M boy & H girl couples.. pic.twitter.com/Is0nis1QbJ— Mr Sinha (@MrSinha_) May 26, 2023