Maharashtra : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బైకుల్లా రైల్వే స్టేషన్ అరుదైన ఘనత సాధించింది. బైకుల్లాకు ఈ ఏడాది యునెస్కో ఆసియా ఫసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ మెరిట్ అవార్డు లభించింది. గత మూడేళ్లుగా స్టేషన్లో జరుగుతున్న పునరుద్ధరణ పనులకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. మనదేశంలోని పురాతన రైల్వే స్టేషన్లలో బైకుల్లా ఒకటి. ఈ స్టేషన్ను బ్రిటీష్ కాలంలో 1853లో నిర్మించారు. బైకుల్లా స్టేషన్ నుంచే మనదేశంలో మొదటి రైలు నడిచింది. పురాతన రైల్వే స్టేషన్ కావడంతో రైల్వే అధికారులు స్టేషన్ను పునరుద్ధరించాలి అనుకున్నారు. ఈ బాధ్యతను బజాజ్ ఛారిటబుల్ గ్రూప్, ఐ లవ్ ముబై అనే ఎన్జీవోకు అప్పగించారు.
కరోనా టైంలో బైకుల్లా స్టేషన్కు మరమ్మతులు చేపట్టాం. అందుకోసం వలస కార్మికులకు స్టేషన్లోనే నాలుగు నెలలు భోజన వసతి కల్పించాం. స్టేషన్ పునరుద్ధరణ ప్రాజెక్ట్తో ఎంతోమంది వలస కార్మికులు జీవనోపాధి లభించిందని కన్జర్వేటివ్ ఆర్కిటెక్ట్ అభయ్ నరైన్ లంభా చెప్పారు.