న్యూఢిల్లీ: అంటార్కిటికా లోతట్టు ప్రాంతంలో ఉండే ఎరెబస్ పర్వతం భూమిపై ఉన్న ఇతర అగ్ని పర్వతాల కన్నా భిన్నమైంది. శాశ్వత లావా సరస్సు కలిగిన ఈ పర్వతం వాతావరణంలోకి స్వచ్ఛమైన బంగారు పలుకులను వెదజల్లడమే ఇందుకు కారణం. 1991లో జరిగిన ఒక అధ్యయనం జియోఫిజికల్ రిసెర్చ్ లెటర్స్లో ప్రచురితమైంది. దాని ప్రకారం ఈ పర్వతం ప్రతి రోజూ 80 గ్రాముల సూక్ష్మ బంగారు రేణువులను విడుదల చేస్తుంది.
ప్రస్తుత పసిడి ధరల ప్రకారం ఈ పర్వతం ప్రతి రోజూ సుమారు రూ.5.66 లక్షలు లేదా సంవత్సరానికి రూ.18.9 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని వెదజల్లుతుంది. ఈ అగ్ని పర్వతం నిరంతరం తన లావా సరస్సు నుంచి విడుదల చేసే వాయువుల్లో ఈ బంగారు రేణువులను గుర్తించారు. ఈ బంగారు రేణువులు ఏర్పడటానికి కచ్చితమైన కారణం ఇంకా అంతు చిక్కకుండా ఉంది.