Pakisthan | ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండే పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రదాడులతో వణికిపోతోందట.అఫ్గాన్లో తాలిబాన్ సర్కార్ వచ్చిన తర్వాత పాక్లో ఉగ్రదాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఓ రిపోర్టు పేర్కొంది. రిపోర్టు ప్రకారం 2021 ఆగస్టు మాసంలోనే పాక్లో అత్యధికంగా ఉగ్రదాడులు జరిగాయి. 2020 లో 16 ఉగ్రదాడులు జరిగితే, 2021లో ఏకంగా 25 ఉగ్రదాడులు జరిగాయి. అయితే 2017 తర్వాతే ఈ దాడుల సంఖ్య పెరుగుతూ వస్తోందని రిపోర్టు పేర్కొంది.
‘పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యురిటీ స్టడీస్’ అనే సంస్థ జరిపిన పరిశోధనలో 2021 సంవత్సరంలోనే పాక్లో అత్యధిక ఉగ్రదాడులు జరిగాయి. నెలవారీగా చూసుకుంటే మాత్రం ఒక్క ఆగస్టులోనే 45 ఉగ్రదాడులు జరిగాయి. అయితే ఓ నెల పాటు కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా… ఈ దాడుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఇక… బలూచిస్తాన్ ప్రాంతం అత్యంత అలజడి రేగే ప్రాంతంగా ఈ రిపోర్టు తేల్చింది. ఇక రెండో ప్రాంతంగా ఖైబర్ ఫక్తూనఖ్వా ప్రాంతమని ఆ రిపోర్టులో తేలింది. ఇదంతా కూడా అఫ్గాన్లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇదంతా జరుగుతోందని ఆ రిపోర్టు పేర్కొంది.