అహ్మాదాబాద్: కొన్ని రోజుల క్రితం గుజరాత్లో మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటనలో 135 మరణించిన విషయం తెలిసిందే. అయితే బ్రిడ్జ్ కూలిన రోజును విజిటర్స్ కోసం సుమారు 3165 మందికి టికెట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 30వ తేదీన మోర్బీ బ్రిడ్జ్ కూలింది. పునర్ నిర్మాణం చేపట్టిన కొన్ని రోజులకే దాన్ని ఓపెన్ చేశారు. భారీ సంఖ్యలో జనం బ్రిడ్జ్ మీదకు చేరడంతో అది కూలిపోయింది. ఒరేవా గ్రూపునకు రెనోవేషన్ పనులు కేటాయించారు.