ముంబై: ముంబై విమానాశ్రయ టర్మినల్2లో ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించారు. కానీ ఆ డ్రిల్ గురించి తెలియకపోవడంతో విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులు హైరానా పడ్డారు. ముంబై ఎయిర్పోర్ట్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముంబై పోలీసులు తెలిపారు. సెక్యూర్టీ ప్రోటోకాల్ ప్రకారం ఇవాళ ఛత్రపతీ శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో మాక్ డ్రిల్ చేశారు. అన్ని రకాల చెకింగ్లు, డ్రిల్స్ పూర్తి అయిన తర్వాత.. విమానాశ్రయం సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. డ్రిల్ కోసం విమానాశ్రయం నుంచి ప్రయాణికులను తరలించిన దృశ్యాలు ఆన్లైన్లో ప్రత్యక్షం అయ్యాయి. డ్రిల్ వల్ల ఫ్లయిట్ల షెడ్యూల్పై ప్రభావం ఉండదని అధికారులు చెప్పారు.