రోమ్, ఆగస్టు 26: సామాజిక మాధ్యమాలతో పొంచి ఉన్న ప్రమాదంపై పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరికలు చేశారు. వీటి కారణంగా మానవ సంబంధాలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో పక్షపాత, విభజన, విద్వేష ధోరణి పెరిగిపోయిందని, దీనిపై శాసనకర్తలు అప్రమత్తంగా ఉండి నిఘా పెట్టాలని ఆయన కోరారు. రోమ్కు చెందిన అంతర్జాతీయ కేథలిక్ లెజిస్లేటర్ల నెట్వర్క్ వార్షిక సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. దురదృష్టవశాత్తు కొందరు తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే వార్తలకు, విభజన, విద్వేష వ్యాప్తికి వినియోగిస్తున్నారన్నారు. ఈ విభజన ప్రచారం వల్ల యువతను వేరు చేయడమే కాక, వారిలో ఒంటరితనాన్ని పెంచుతున్నదని ఆయన అన్నారు.