రాయ్పూర్: లైంగిక సంబంధం కోసం బలవంతం చేస్తుండటంతో బాయ్ఫ్రెండ్ను బాలిక చంపింది. స్నేహితురాలితో కలిసి గొంతుకు తాడు బిగించి హత్య చేసింది. దర్యాప్తులో ఈ విషం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దరు మైనర్ బాలికలను అరెస్ట్ చేశారు. (Girl Strangulates Boyfriend) ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పుట్సురా గ్రామానికి చెందిన 18 ఏళ్ల వీరేంద్ర యాదవ్, తన సోదరి పునితా యాదవ్తో కలిసి బలరాంపూర్లో నివసిస్తున్నాడు.
కాగా, వీరేంద్ర తీవ్రంగా గాయపడినట్లు స్నేహితురాళ్ల ద్వారా పునీతాకు తెలిసింది. రూమ్లో అచేతనంగా పడి ఉన్న సోదరుడ్ని ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
దీంతో సోదరుడు వీరేంద్ర మృతిపై సోదరి పునీతా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు. పునీతా స్నేహితురాళ్లైన ఇద్దరు మైనర్ బాలికలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిద్దరిలో ఒక బాలిక, వీరేంద్ర మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తెలుసుకున్నారు. అయితే లైంగిక సంబంధం కోసం వీరేంద్ర బలవంతం చేస్తుండటంతో స్నేహితురాలితో కలిసి గొంతుకు తాడు బిగించి చంపినట్లు పోలీసులకు ఆ బాలిక చెప్పింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మైనర్ బాలికలను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.