న్యూఢిల్లీ, మార్చి 17: ఈపీఎస్ 1995 కింద ఈపీఎఫ్ చందాదారులు ఉద్యోగ విరమణ అనంతరం పొందే కనీస పింఛన్పై కార్మిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం కీలక సిఫారసులు చేసింది. ప్రస్తుతం ఈపీఎఫ్ చందాదారులు రూ.1,000 కనీస పెన్షన్ను పొందుతున్నారు. అయితే ఇది ఎంతమాత్రం సరిపోదని, దీనిని రూ.7,500కు పెంచాలని చాలా ఏండ్లుగా వారు కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో కార్మిక, వస్త్ర, నైపుణ్య అభివృద్ధి స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని కమిటీ ‘గ్రాంట్ల కోసం డిమాండ్లు’పై 15వ నివేదికను మంగళవారం పార్లమెంట్కు సమర్పించింది. సామాజిక భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేయాలని, న్యాయమైన వేతనాలు చెల్లించాలని, దేశవ్యాప్తంగా కార్మిక పరిపాలనను ఆధునీకరించాలని, ఈ-శ్రమ్ పోర్టల్లో గిగ్ వర్కర్ల నమోదును తప్పనిసరి చేయాలని కమి టీ ప్రధానంగా సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈపీఎఫ్ పింఛన్ కింద ఇస్తున్న రూ.1,000 కనీస మొత్తాన్ని పెంచాలని సూచించింది.