Mig-21 Probe | మిగ్ -21 యుద్ధ విమానాల విషయంలో వైమానిక దళం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్లో జరిగిన ప్రమాదానికి గల కారణాలపై విచారణ పూర్తయ్యే వరకు యుద్ధ విమానాల వినియోగాన్ని నిలిపివేసింది. సూరత్గఢ్ ఎయిర్బేస్ నుంచి బయలుదేరిన మిగ్-21 బైసన్ విమానం మే 8న రాజస్థాన్లోని కూలడంతో ముగ్గురు పౌరులు మృతి చెందారు. అయితే, విచారణ పూర్తయి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే వరకు మిగ్-21 విమానాలను నిలిపివేస్తున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ఫోర్స్లో మూడు MiG-21 స్క్వాడ్రన్లు మాత్రమే పనిచేస్తున్నాయి.
రాబోయే రెండేళ్లలో దశలవారీగా వాటిని రక్షణశాఖ వాటిని తొలగించనున్నది. భారత వైమానిక దళంలో 31 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. వాటిలో మూడు మిగ్-21 బైసన్ వేరియంట్. 1960లలో భారత వైమానిక దళంలోకి MiG-21 ప్రవేశపెట్టారు. ఇటీవల మిగ్ యుద్ధ విమానాలు ఇటీవల ప్రమాదాలకు గురవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ క్రమంలోనే దశలవారీగా ఆ విమానాలను తొలగించేందుకు రక్షణ శాఖ వ్యూహ రచన చేస్తున్నది. ఎయిర్ఫోర్స్లోకి అధునాతన మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్తో పాటు ఎల్సీఏ మార్క్-1ఏ, ఎల్సీఏ మార్క్-2లతో సహా స్వదేశీ విమానాలను చేర్చాలని చూస్తున్నది.