భువనేశ్వర్: అమెరికా కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఒడిశాలో పర్యటించారు. బుధవారం ఉదయం భువనేశ్వర్లో ఒక మురికివాడను ఆయన సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి మా మంగళ బస్తీలోని బిజూ ఆదర్శ్ కాలనీకి బిల్ గేట్స్ వెళ్లారు. మురికివాడ నివాసితుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేసే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఆయన మాట్లాడారు.
కాగా, మురికివాడల నివాసితులకు భూమి హక్కులు కల్పించడంతోపాటు నీటి కనెక్షన్లు, మరుగుదొడ్లు, కరెంటు సదుపాయం వంటి వసతులు సమకూర్చడాన్ని బిల్ గేట్స్కు చూపించినట్లు ఆ రాష్ట్ర డెవలప్మెంట్ కమిషనర్ అను గార్గ్ తెలిపారు. స్లమ్ ఏరియాను మోడల్ కాలనీగా అభివృద్ధి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. సీఎం నవీన్ పట్నాయక్తో బిల్ గేట్స్ సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు.
#WATCH | Odisha: Microsoft co-founder and philanthropist Bill Gates visits Maa Mangla Basti in Bhubaneswar and discusses with slum dwellers the basic amenities available to them and Jaga Mission scheme of the govt.
(Video: Information & Public Relations Department, Odisha… pic.twitter.com/3vIDBPaCj0
— ANI (@ANI) February 28, 2024