లక్నో: కొందరు దుండగులు ఒక రెస్టారెంట్పైకి కుర్చీలు విసిరారు. ఆ రెస్టారెంట్ యజమాని, అతడి సోదరిని కర్రలతో కొట్టారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నోయిడా సెక్టార్ 46లోని గ్లోరీ మార్కెట్ వద్దకు కొందరు వ్యక్తులు వచ్చారు. ఫిట్ ఫుడీ రెస్టారెంట్ ఎదుట స్టంట్లు చేశారు.
గమనించిన ఆ రెస్టారెంట్ యజమాని దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆ వ్యక్తులు, రెస్టారెంట్ యజమాని మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆ దుండగులు రెచ్చిపోయారు. రెస్టారెంట్ బయట ఉన్న కుర్చీలను యజమాని పైకి విసిరారు. అలాగే మరి కొందరు కర్రలతో విధ్వంసం సృష్టించారు. రెస్టారెంట్ యజమాని, అతడి సోదరిపై దాడి చేశారు.
కాగా, ఈ సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ రెస్టారెంట్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Noida नोएडा के सेक्टर 46 मे मारपीट। आधा दर्जन से ज्यादा लोगों के बीच हुई मारपीट,मारपीट की घटना CCTV मे कैद। गाड़ी से स्टंट करने से रोकने पर मारपीट का आरोप, जमकर चले लात घूसे और कुर्सियां, थाना सेक्टर 39 का मामला!#noidapolice #noidacrime #noidacity #noidanews #morningpodcast pic.twitter.com/xtQf8wrDL3
— Amit Singh Rana (@AmitNationalist) January 21, 2023