మీరట్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 22: తమకు అధికారం దక్కితే మీరట్ పేరును నాథూరామ్ గాడ్సే నగర్గా మార్చుతామని హిందూ మహాసభ తెలిపింది. త్వరలో జరుగనున్న మీరట్ నగర సంస్థ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించింది.
ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలిచి, మేయర్ పీఠం దక్కితే ముస్లిం పేర్లున్న ప్రాంతాలకు హిందువుల్లోని ప్రముఖుల పేర్లు పెడుతామని పేర్కొన్నది. తమది హిందుత్వ భావాజాలమని చెప్పుకునే బీజేపీ, శివసేన ప్రస్తుతం ఆ భావాజాలాన్ని వదిలేశాయని హిందూ మహాసభ విమర్శించింది. దేశాన్ని ‘హిందూ దేశం’గా మార్చడమే తమ ప్రథమ ప్రాధాన్యమని, తర్వాత ప్రతి హిందువు గో మాతను పరిరక్షించేలా చూడటం రెండో ప్రాధాన్యమని మ్యానిఫెస్టోలో పేర్కొన్నది.