చండీగఢ్: పంజాబ్లో శాంతిభద్రతలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. తుపాకులు చేతపట్టిన నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒక దొంగ పట్టపగలే గన్తో బెదిరించి ఒక మహిళ మెడలోని గోల్డ్ చైన్ను లాక్కొనిపోయాడు. అడ్డుకోబోయిన బాలికపై దాడి చేశాడు. తర్న్ తరణ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం ఒక మహిళ తన కుమార్తెను స్కూటీపై స్కూల్కు తీసుకెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆమె స్కూటీ తీస్తుండగా వెనుక నుంచి వచ్చిన ముసుగు ధరించిన వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఆ మహిళను బెదిరించాడు. ఆమె మెడలోని బంగారు గొలుసును బలవంతంగా తీయసాగాడు.
కాగా, స్కూల్ డ్రెస్, బ్యాగ్తో ఉన్న ఆ మహిళ కుమార్తె ఆ దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అయితే అతడు ఆమెను కిందకు తోసేయడంతోపాటు చెంపపై కొట్టాడు. చైన్ చోరీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పొరుగువారిని కూడా తుపాకీతో బెదిరించాడు. పెనుగులాడిన ఆ మహిళ మెడలోని చైన్ను లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఇరుగు పొరుగు వారు పరుగున ఆ మహిళ వద్దకు వచ్చారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పంజాబ్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. రోజు రోజుకు దిగజారుతున్న శాంతిభద్రతలపై సీఎం భగవంత్ మాన్ ప్రత్యేకంగా దృష్టిసారించాలని పలువురు డిమాండ్ చేశారు.
This is the Video of Tarn Taran, Punjab. These two people snatched the Chain from women in broad day light.
I request @PunjabPoliceInd @TarnTaranPolice @CMOPb @DGPPunjabPolice to take immediate actions against them…. pic.twitter.com/PiLeMUHpoO— Kunal Gupta (@KunalGu07055368) November 10, 2022