ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై జైలు పాలయిన మరాఠీ నటి కేతకి చితాలె సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ కస్టడీలో తనపై భౌతిక దాడి చేశారని, వేధింపులకు గురిచేయడంతో పాటు చట్టవిరుద్ధంగా నిర్భందించారని కేతకి ఆరోపించారు.
“నన్ను చట్టవిరుద్ధంగా ఇంటి నుంచి తీసుకువెళ్లి, జైలు పాలు చేశారు.. లైంగిక వేధింపులకు గురిచేసి తీవ్రంగా కొట్టారని ” ఆమె ఓ వార్తాసంస్ధతో పేర్కొన్నారు. ఓ ఫేస్బుక్ పోస్ట్కు సంబంధించి గత నెలలో అరెస్టయిన కేతకి చితాలెకు థానే కోర్టు జూన్ 22న బెయిల్ మంజూరు చేసింది.
శరద్ పవార్ ప్రతిష్టను దిగజార్చేలా ఫేస్బుక్లో పోస్ట్ షేర్ చేయడంపై ఈ ఏడాది మే 14న ఆమెను థానే పోలీసులు అరెస్ట్ చేశారు. చితాలె చేసిన పోస్ట్ రాజకీయ పార్టీల మధ్య సంవాదానికి దారితీయవచ్చని ఫిర్యాదుదారు స్వప్నిల్ నెట్కే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చితాలెపై మహారాష్ట్రలో 22 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. చితాలెపై మే 20న మరో కేసు నమోదవగా ఆ కేసులోనూ జూన్ 16న ఆమెకు బెయిల్ లభించింది.