Manish Sisodia | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. తదుపరి విచారణకు వర్చువల్గా హాజరుకావాలనుకుంటే.. దరఖాస్తు దాఖలు చయాలని కోరింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణల నేపథ్యంలో సీబీఐ, ఈడీ ఆయనను విచారిస్తున్నాయి. ఈ క్రమంలో ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను కోర్టు ముందు హాజరుపరిచింది. దర్యాప్తు పెండింగ్లో ఉన్నందన సిసోడియాను కస్టడీని సీబీఐ కోరడంతో కస్టడీని పొడిగించింది.
దర్యాప్తు దశలో ఉందని, జ్యుడీషియల్ కస్టడీ అవసరమని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని అవెన్యూ కోర్టు కస్టడీని ఏప్రిల్ 3 వరకు పొడిగించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు ఆటంకం కలిగించేందుకు డిజిటల్ సాక్ష్యాలను పెద్ద ఎత్తున ధ్వంసం ఆప్ నేతకు భాగస్వామ్యం ఉందని, 14 ఫోన్లను మార్చడంతో పాటు ధ్వంసం చేశారని ఢిల్లీ కోర్టుకు ఈడీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ ఫిబ్రవరి 26న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.