Murder Case | న్యూయార్క్ : నిరపరాధి అయినప్పటికీ, దొంగతనం, హత్య కేసులో దాదాపు మూడు దశాబ్దాలపాటు జైలులో మగ్గిపోయిన మైఖేల్ సూలివాన్ (64)కు దాదాపు రూ.110 కోట్ల పరిహారం లభించింది. 1986లో మసాచుసెట్స్లోని ఫ్రామింగ్హామ్లో విల్ఫ్రెడ్ మెక్గ్రాత్ దొంగతనం, హత్యకు గురయ్యారు. ఈ కేసులో గ్యారీ గ్రేస్ కూడా అనుమానితుడు. అయితే, మైఖేల్ను గ్యారీ ఇరికించాడు.
దీంతో ఆయనపై ఆరోపణలను ప్రాసిక్యూషన్ ఉపసంహరించింది. మైఖేల్కు యావజ్జీవ జైలు శిక్ష పడింది. మసాచుసెట్స్ జ్యూరీ ఈ కేసులో మైఖేల్ నిర్దోషి అని తీర్పు చెప్పింది. ఆయనకు నష్టపరిహారంగా రూ.110 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఆయన జైలులో ఉన్న కాలంలో ఆయన తల్లి, నలుగురు తోబుట్టువులు మరణించారు. జైలులో అనేకసార్లు దాడులకు గురయ్యారు.