ముంబై: లోకల్ ట్రైన్లోని లేడీస్ కోచ్లోకి ఒక వ్యక్తి ఎక్కాడు. గేట్ వద్ద ఉన్న అతడు కర్చీఫ్లో ఉన్న గంజాయ్ని పీల్చాడు. (Man consumes drugs in Ladies Coach) ఆందోళన చెందిన ఒక మహిళ ఈ విషయాన్ని రైల్వే, స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ముంబై లోకల్ ట్రైన్లోని లేడీస్ కోచ్లోకి ఒక వ్యక్తి ఎక్కాడు. గేట్ వద్ద ఉన్న చాలా నిర్లక్ష్యంగా నిల్చొని ప్రయాణించిన అతడు చేతిలోని కర్చీఫ్లో ఉన్న గంజాయ్ని పీల్చాడు.
కాగా, గమనించిన ఒక మహిళ తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేసింది. రైల్వే పోలీసులు, ముంబై పోలీసులకు షేర్ చేసింది. రైళ్లలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు లోక్సభ ఎంపీ, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే దృష్టికి ఈ వీడియో క్లిప్ వెళ్లింది. దీంతో ఆమె కూడా దీనిపై స్పందించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే యువత డ్రగ్స్కు బానిసకావడం, వారికి డ్రగ్స్ స్వేచ్ఛగా లభించడంపై రైల్వే మంత్రిత్వ శాఖ, పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
मुंबईतील उपनगरीय रेल्वे वाहतूकीच्या सेवेच्या सुरक्षेचा मुद्दा पुन्हा एकदा उपस्थित होत आहे. महिलांच्या डब्यात घुसून नशा करणाऱ्या या तरुणाचा व्हिडिओ महिलांच्या सुरक्षेची स्थिती काय आहे याबाबत स्पष्ट भाष्य तर करीत आहेच याशिवाय तरुणांना नशेची हि सामुग्री राजरोसपणे मिळत असल्याचे देखील… https://t.co/VlwFK6WcK2
— Supriya Sule (@supriya_sule) October 19, 2023