ముంబై: ఒక వ్యక్తి రోడ్డుపై ఉమ్మి వేశాడు. గమనించిన అధికారి ఆ వ్యక్తితో శుభ్రం చేయించాడు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనవరి 16, 17 తేదీల్లో జీ 20 దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం పూణెలో జరిగింది. ఈ నేపథ్యంలో కఠినమైన క్లీన్నెస్ డ్రైవ్ను పూణె మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేసింది. రోడ్లు, పుట్పాత్లు, డివైడర్లపై ఉమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కాగా, ఈ నెల 14న ఒక వ్యక్తి పూణే యూనివర్శిటీ రోడ్డుపై వెళ్తూ ఉమ్మాడు. గమనించిన పూణె మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అతడికి శిక్ష విధించారు. ఉమ్మిన చోట ఆ వ్యక్తితోనే శుభ్రం చేయించారు. ఇకపై ఈ విధానాన్ని అమలు చేయాలని పూణె మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు, 2020లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కఠినమైన నిర్ణయం తీసుకుంది. బహిరంగంగా ఉమ్మడాన్ని విపత్తు నిర్వహణ చట్టం కింద శిక్షార్హమైన నేరంగా పేర్కొంది. దీంతో జనం కొన్ని రోజుల పాటు బహిరంగంగా ఉమ్మడానికి దూరంగా ఉన్నారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో జనం మళ్లీ పాత ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
As per the Pune Municipal Corporation's new campaign, if the citizens spit on roads and footpaths they'll have to clean it themselves pic.twitter.com/sJZ7soa6tE
— Mirror Now (@MirrorNow) January 14, 2023