చండీగఢ్: ఒక వ్యక్తి గురుద్వారాలో దొంగతనం చేసినట్లు జనం ఆరోపించారు. ఈ నేపథ్యంలో అతడ్ని కట్టేసి కొట్టి చంపారు. (Man beaten to death) పంజాబ్లోని మోగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 16న గురుసర్ మడి గ్రామానికి చెందిన కరమ్ సింగ్ను కొందరు గ్రామస్తులు ఆసుపత్రిలో చేర్చారు. స్థానిక గురుద్వారాలో చోరీకి పాల్పడి పారిపోతుండగా తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఆ యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. అయితే గ్రామ పెద్దలు, స్థానికుల ఒత్తిడితో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, కరమ్ సింగ్ మరణించిన పది రోజుల తర్వాత అతడ్ని కట్టేసి దారుణంగా కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్థానికంగా ఇది కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మరో 16 మంది పేర్లను కూడా చేర్చి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
A lower-caste skh, Karam Singh, was tied to a window and mercilessly ßeaten to death over theft charges by villagers in the Gurusar Madi area of Mustafa village in Moga district. They filmed the whole video of Ly* ching and also sent it to his mother. pic.twitter.com/dUjI5KuI0t
— Āryā_Anvikṣā 🪷 (@Arya_Anviksha_) October 28, 2023