జైపూర్: రాజస్థాన్లో భయానక సంఘటన చోటుచేసుకున్నది. పాలి జిల్లాలోని సారధన గ్రామంలో ఓ వృద్ధురాలిని చంపి ఆమె మాంసం తిన్నాడో వ్యక్తి. శుక్రవారం శాంతిదేవి(65) అనే మహిళ పశువులను మేపుతుండగా సురేంద్ర ఠాకూర్ అనే వ్యక్తి రాయితో దాడి చేసి హత్య చేశాడు. తర్వాత ఆమె మాంసాన్ని తిన్నాడు.
నిందితుడు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుండటంతో పోలీసులు అతడిని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడికి హైడ్రోఫోబియా(కుక్కకాటు వల్ల వచ్చే జబ్బు) ఉన్నట్టు గుర్తించారు. అతడికి గతంలో రేబిస్ వ్యాధి సోకినా కుక్క కరిచినా వ్యాక్సిన్ తీసుకోకపోయి ఉంటాడని వైద్యులు తెలిపారు.