కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీని ఆ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. ఇది పార్టీ తీసుకున్న కీలక నిర్ణయమని, దేశవ్యాప్త రాజకీయాలపై పార్టీ దృష్టి సారించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. కాగా, మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనకు ముందు టీఎంసీ పార్లమెంటరీ చీఫ్గా ఆమెను నియమించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
మరోవైపు కేంద్ర ఐటీ మంత్రి అశ్వని వైష్ణవ్ గురువారం రాజ్యసభలో పెగాసస్పై వివరణ ఇస్తుండగా ఆయన నుంచి పత్రాలు లాక్కొని చించేసిన టీఎంసీ ఎంపీ శాంతను సేన్ను శుక్రవారం రాజ్యసభ చైర్మన్ సస్పెండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీఎంసీ పార్లమెంటరీ చీఫ్గా మమతను నియమించడం విశేషం. దీంతో పార్లమెంట్కు ఎన్నిక కాకపోయినా పార్టీ పార్లమెంట్ చీఫ్గా ఉన్న నేతల సరసన మమతా బెనర్జీ చేరారు. 1998లో సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన నేపథ్యంలో ఆ పార్టీ పార్లమెంటరీ చీఫ్గా వ్యవహరించారు.