అహ్మదాబాద్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్జాయి జీవిత కథకు చెందిన ‘ఐయామ్ మలాలా'(I Am Malala) బుక్ రీడింగ్ ఈవెంట్ హింసాత్మకంగా మారింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఆ పుసక్తం చదువుతున్న వారిపై హిందుత్వ కార్యకర్తలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు బుక్ చేశారు. నగరంలోని వస్త్రాపూర్ గార్డెన్లో మలాలా పుస్తక పఠనం జరిగింది. అయితే దాడి కేసులో ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. సుమారు 20 మందితో కూడిన ఓ గ్రూపు వస్త్రాపూర్ గార్డెన్లో మలాలా జీవితకథ పుస్తకాన్ని చదివేందుకు గమ్మికూడారని, అయితే పబ్లిక్ గార్డెన్లో పఠనం జరిగిన తర్వాత వారిపై సుమారు 20 మందితో కూడిన సాయుధ గ్రూపు దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆ బుక్ రీడింగ్ గ్రూపుపై దాడి చేసిటన్లు గుర్తించారు. ఆ పుస్తకాన్నే ఎందుకు ఎంచుకున్నారన్న కోణంలో ఆ అటాక్ జరిగినట్లు భావిస్తున్నారు.