కోల్కతా: పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి ఓ లేఖ రాశారు. తనపై జరుగుతున్న దర్యాప్తునకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం అవసరమని తెలిపారు.
ఈ నెల 31న హాజరుకావాలని తనకు సమన్లు ఇచ్చారని, నవంబరు 4 వరకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని, నవంబరు 5 తర్వాత హాజరుకాగలనని తెలిపారు. పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి ఓ వ్యాపారవేత్త నుంచి మహువా ముడుపులు తీసుకున్నట్లు ఆమె మాజీ సన్నిహితుడు దేహద్రాయ్ ఆరోపించారు.