Maha` Confidence Motion | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి గురువారం తెర పడబోతున్నది. గురువారం మధ్యాహ్నం 11.30 గంటల్లోపు బల నిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ను మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశియారీ ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ కోశియారీతో చర్చించారు. ఆ తర్వాతే ఉద్ధవ్ సర్కార్ బల నిరూపణకు గవర్నర్ ముహూర్తం ఖరారు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
గవర్నర్ కోశియారీతో భేటీ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమి సర్కార్ మెజారిటీ కోల్పోయిందన్నారు. అసెంబ్లీలో బల పరీక్షకు పిలవాలని గవర్నర్ కోశియారిని కోరినట్లు ఫడ్నవీస్ చెప్పారు.
శివసేన నుంచి ఏక్నాథ్ షిండే సారధ్యంలో దాదాపు 40 మంది పార్టీ ఎమ్మెల్యేలు, కొందరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రం అసోంలోని ఓ హోటల్లో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఏక్నాథ్ షిండేతోపాటు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదో సోమవారం సాయంత్రంలోపు తెలుపాలని డిప్యూటీ స్పీకర్ ఆదేశించారు.
డిప్యూటీ స్పీకర్ ఆదేశాలను షిండే వర్గం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. వచ్చే నెల 11 వరకు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ను ఆదేశించింది. రెబెల్ ఎమ్మెల్యేలకు జారీ చేసిన నోటీసుల విషయమై నివేదిక సమర్పించాలని డిప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.