ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ ( Corona virus ) మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్నాళ్లుగా అక్కడ కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే ఇటీవల మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇవాళ కొత్తగా 6,388 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63,75,390కి పెరిగింది. ఇవాళ కొత్తగా మరో 8,390 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 61,75,010కి చేరింది.
ఇక కరోనా మరణాలు కూడా మహారాష్ట్రలో పెద్దసంఖ్యలోనే నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 208 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,34,572కు పెరిగింది. ఇక మహారాష్ట్రలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల నుంచి రికవరీలు, మరణాలు పోగా మరో 62,351 యాక్టివ్ కేసులు ఉన్నాయి.