ముంబై: క్రికెట్ బెట్టింగ్లో (Cricket Betting) ఓ పోలీస్ అధికారి కోటిన్నర గెలుచుకున్నాడు. అయితే అదే అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది. నిబంధనలు అతిక్రమించాడని, పోలీస్ శాఖకు అప్రతిష్ఠ తీసుకొచ్చాడంటూ అతనిపై మహారాష్ట్ర పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. ఎస్ఐ సోమనాథ్ జెండే (SI Somnath Zende) మహారాష్ట్రలోని పింప్రి-చించ్బాడ్ పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 10న విధుల్లో ఉండి ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మ్యాచ్పై ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్11 (Dream11) నిర్వహించిన బెట్టింగ్లో పాల్గొన్నాడు. ఆయన ఎంపిక చేసుకున్న జట్టు ఫాంటసీ గేమ్లో అగ్రస్థానంలో నిలవడంతో రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో ఆయనతోపాటు కుటుంబ సభ్యులు స్వీట్స్ పంచుకుని సంబురాలు చేసుకున్నారు. అయితే అది ఎక్కువసేపు నిలువలేదు.
పోలీసులే బెట్టింగ్కు పాల్పడంతో వివాదం చెలరేగింది. స్పందించిన పోలీస్ శాఖ దీనిపై విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తిచేసిన అధికారులు సోమనాథ్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి శాఖాపరమైన విచారణ బాధ్యలతను డీసీపీ స్వప్నా గోర్కి అప్పగించారు.