థానె: మహారాష్ట్రలోని థానె జిల్లాలో దారుణం జరిగింది. ఓ 65 ఏండ్ల వృద్ధురాలిపై 25 ఏండ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. థానె నగరంలోని ఓ హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న 25 ఏండ్ల యువకుడు మంచినీళ్ల కోసం ఓ ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలి తాగడానికి మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు. ఆమె నీళ్లు తీసుకుని వచ్చేలోపు ఒంటరిగా ఉన్నదని గమనించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ నెల 3న ఈ ఘటన చోటుచేసుకోగా.. అదేరోజు వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.