న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కరోనా ఉధృతి దృష్ట్యా కొవిడ్ కర్ఫ్యూను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ నిబంధనలను ఈ నెలాఖరు వరకు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఆ నగర సంక్షోభ నిర్వహణ బృందం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కరోనా ఉధృతి నేపథ్యంలో ఇక్కడ ఏప్రిల్ 12 నుంచి కర్ఫ్యూ విధించారు. ఆ తరువాత మే 24 వరకు పొడిగించారు. అయినా పాజిటివ్ కేసుల శాతం తగ్గకపోవడంతో ఈ నెల 31 వరకు కర్ఫ్యూను కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చారు. భోపాల్లో గడిచిన 24 గంటల వ్యవధిలో 609 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి. 11 మంది మృత్యువాతపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.