లూథియానా : ఆ బాలుడి వయసు మూడున్నర ఏండ్లే.. మాటలు కూడా సరిగా రాని వయస్సులో అద్భుత మేథోశక్తితో అందరినీ సంభ్రమాశ్చరయ్యానికి గురిచేశాడు. ఏకంగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించి ఔరా.! అనిపించాడు. అతడే పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన కున్వార్ ప్రతాప్ సింగ్. సరాభా నగర్లోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు 48 సెకండ్లలో చెప్పడం. 23 నిమిషాల 48 సెకన్లలో 27 పుస్తకాలు చదివడం.. 14 గుణకారాలను, 27 స్మారక చిహ్నాల పేర్లను నిమిషం వ్యవధిలోనే గుర్తించడంతో ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అతడి పేరు గ్రాండ్ మాస్టర్గా చేరిపోయింది.
పలు ఘటనలకు సంబంధించిన వివరాలు, జరిగిన ఏడాదిని సైతం గుర్తించడం కున్వార్ ప్రత్యేకం. అద్భుత జ్ఞాపకశక్తి, ఆమోగమైన తెలివి తేటలతో చైల్డ్ ప్రొడిజీ మ్యాగజైన్కు సైతం ఈ బుజ్జాయి ఎంపికయ్యాడు. కాలనీలోని ప్రతి ఒక్కరి పేర్లు గుర్తు పెట్టుకోగలగడం, తనతో ఆడుకునేందుకు వచ్చిన పిల్లలకు పాఠాలు బోధించడం ఈ బాలుడి అదనపు ప్రత్యేకతలు. వివిధ ఒలింపియాడ్లలోనూ రాణించి పలు ప్రపంచ రికార్డులు సాధించాడు. ఇవే కాకుండా స్పష్టంగా చదవడం, సుధీర్ఘ పదాలను స్పష్టంగా పలకడం, 1 నుంచి 40 ఎక్కాలనూ గంటాపథంగా చెప్పగలడు. దేశంలోని అన్ని దేశాల రాజధానుల పేర్లను గుర్తించగలడు. భాగాహారాలు, తీసివేతలు, కూడికలు చేయడంలో కున్వార్ ప్రతాప్ సింగ్ దిట్ట.