అహ్మదాబాద్: 2017 ఎన్నికలతో పోలిస్తే ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. మొదటి దశలో గురువారం 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. 63.31 శాతం పోలింగ్ నమోదైంది. 2017లో తొలిదశలో ఇదే 89 స్థానాల్లో 66.7% ప్రజలు ఓటేశారు.
సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్లోని 19 జిల్లాల్లో గురువారం నాటి మొదటి దశ పోలింగ్ జరిగింది. నర్మదా జిల్లాలోని దేడియాపాడ నియోజకవర్గంలో అత్యధికంగా 82.71% మంది ఓటర్లు ఓటేయగా, కచ్ జిల్లాలోని గాంధీధామ్లో అత్యల్పంగా 47.86 శాతం పోలింగ్ నమోదైంది.