న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కుదించారు. దీంతో ఇవాళ లోక్సభను నిరవధిక వాయిదా వేశారు. చైర్లో ఉన్న ప్యానల్ స్పీకర్ బర్తుహరి మహతబ్ .. లోక్సభలో చేపట్టిన కార్యకలాపాల గురించి వెల్లడించారు. స్పీకర్ ఓం బిర్లా సభా నిర్వహణకు అద్భుతమైన ఏర్పాట్లు చేశారన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఓం బిర్లా ప్రస్తుతం కోలుకుంటున్నట్లు బర్తుహరి తెలిపారు. ఈ సారి సభలో 24 సిట్టింగ్స్ జరిగినట్లు ఆయన వెల్లడించారు. 132 గంటల పాటు సభ జరిగినట్లు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా 16 గంటల పాటు లోక్సభలో చర్చ జరిగిందన్నారు. కేంద్ర బడ్జెట్పై 14 గంటల 42 నిమిషాల పాటు చర్చ జరిగిందన్నారు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్పై 21 గంటల 43 నిమిషాల పాటు చర్చ చేపట్టారు. ఈసారి సమావేశాల్లో 17 ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టారు. 18 బిల్లులను ఆమోదించారు. 84 స్టార్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. స్టాండిగ్ కమిటీలు 163 నివేదికలను సమర్పించాయి. మొత్తం 3591 పేపర్స్ను టేబుల్పై ఉంచినట్లు బర్తుహరి తెలిపారు. ఈసారి లోక్సభ సమావేశాల్లో పని తీరు బాగుందని, ప్రొడక్టివిటీ రేటు 114 శాతం ఉన్నట్లు ఆయన చెప్పారు.