సైనికులు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి పహారా కాస్తారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో జీవిస్తారు. శత్రుదేశ సైన్యాల తూటాలకు ఎదురొడ్డి దేశాన్ని రక్షిస్తారు. దేశ సేవకు తమ జీవితాన్ని అంకితం చేస్తారు. వారు అలా పనిచేయడం వల్లే మనం మన ఇళ్లల్లో సురక్షితంగా జీవించగలుగుతున్నాం. అలాంటివారికి మనమెప్పుడూ కృతజ్ఞతతోనే ఉండాలి. ఓ చిన్నారి సైనికుడిని చూడగానే పరుగెత్తికెళ్లి ఆయన పాదాలకు మొక్కింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ట్విటర్లో షేర్ చేశారు. ‘చిన్నతనంలోనే పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడం ప్రతి తల్లిదండ్రి కర్తవ్యం’ అని ఆయన క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో కొంత మంది సైనికులు నిల్చుని ఉంటారు. ఓ చిన్నారి పరుగెత్తుకొని వచ్చి మొదట ఒక సైనికుడి వద్ద ఆగుతుంది. ఆయన పాదాలను తాకి నమస్కరిస్తుంది. అనంతరం ఆ సైనికుడు ఆ పాపను దగ్గరకు తీసుకుంటాడు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఇప్పటికే 1.2 మిలియన్ల వీక్షణలను సొంత చేసుకుంది. 89వేల మందికిపైగా ఈ వీడియోను లైక్ చేశారు.
Raising patriotic young minds is a duty every parent owes to this great nation.
Jai Hind 🇮🇳 pic.twitter.com/mhAjLbtOvG
— P C Mohan (@PCMohanMP) July 15, 2022