Sukkha Dunake Murder Case | ఇటీవల కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురయ్యాడు. అయితే, ఈ వ్యవహారంలో కెనడా ప్రధాని భారత్పై అడ్డగోలు ఆరోపణలు చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మరో ఖలిస్థాని సానుభూతిపరుడు, గ్యాంగ్స్టర్ సుఖ్దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకే హత్యకు గురయ్యాడు. కెనడాలోని జరిగిన గ్యాంగ్ వార్లో ప్రత్యర్థి గ్యాంగ్ బుధవారం జరిపిన జరిపిన దాడిలో మృతి చెందినట్లు తెలుస్తున్నది. కాల్పులను నిర్ధారించిన విన్నీపెగ్ పోలీసులు.. మృతుల వివరాలపై మాత్రం స్పష్టతనివ్వలేదు.
అయితే, తమపనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. గ్యాంగ్స్టర్లు గుర్లార్బ్రార్, విక్కీ మిదిఖేరాల హత్యలో సుఖా ప్రధాన పాత్ర పోషించాడని.. అతడు విదేశాల్లో ఉన్నా హత్యలకు ప్లాన్ చేసినట్లుగా బిష్ణోయ్ గ్యాంగ్ ఆరోపించింది. అతను మత్తుపదార్థాలకు బానిసని, ఎంతో మంది యువకులు, ప్రజల జీవితాలను నాశనం చేశాడని.. చివరకు చేసిన పాపాలకు శిక్ష అనుభవించాడని పేర్కొంది. దవీందర్ బంబిహా ముఠాకు చెందిన సుఖ్దూల్ సింగ్ మరో గ్యాంగ్స్టర్ సందీప్ నంగల్ అంబియాను సైతం చంపేశారని బిష్ణోయ్ గ్యాంగ్ పేర్కొంది. వారు భారత్లోనే కాదు ఏ దేశంలో దాక్కున్నా ప్రశాంతంగా జీవించలేరంటూ ప్రత్యర్థి గ్యాంగ్లకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చిరకలు పంపింది. అయితే, కాంగ్రెస్ నేత, సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ డ్రగ్స్ రవాణా కేసులో అరెస్టు కాగా.. అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు.
హత్యకు గురైన సుఖా స్వస్థలం పంజాబ్ మోఘా. దేవిందర్ బంబిహా గ్యాంగ్కు చెందిన ఏ-కేటగిరి గ్యాంగ్స్టర్. సుఖా దునెకేపై భారత్లో పలు క్రిమినల్ కేసులున్నాయి. పంజాబ్తో పాటు పలు రాష్ట్రాల్లో 20పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఎన్ఐఏ సైతం అతనిపై కేసులు నమోదు చేసింది. 2017లో అతడు నకిలీ పత్రాలతో కెనడాకు పారిపోయి.. అక్కడి నుంచి పనిచేస్తున్న గ్యాంగ్స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాలో చేరినట్లు నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఖలిస్థానీ ఉద్యమంలో సుఖా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది.