న్యూఢిల్లీ, నవంబర్ 16: గుంట జాగ లేదు. కానీ పొలాల్లో పనిచేసినోడు. రైతు కష్టం తెలిసినోడు. రైతు బాగుంటెనే తన లాంటి వ్యవసాయ కూలీ బాగుంటడని నమ్మినోడు. అందుకే ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమానికి రైతులతో పాటే కదిలాడు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా పోరాడాడు. కేంద్రం గుండె కరగలేదు. తన గుండె ఆగింది. పంజాబ్కు చెందిన 65 ఏండ్ల వ్యవసాయ కూలీ మోహీందర్ సింగ్.. టిక్రీ సరిహద్దులో మంగళవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. పేదరికం కారణంగా మోహీందర్ పెండ్లి కూడా చేసుకోలేదు. 2.5 ఎకరాల స్థలం ఉంటే చెల్లి పెండ్లి కోసం అమ్మేశారు. ఆయనకు ఇద్దరు సోదరులున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో ఇప్పటివరకు 665 మంది చనిపోయారు.