పాట్నా: బీహార్ బీజేపీ నేత, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ టిక్కెట్లు అమ్ముకోవడంలో నిష్ణాతుడైన రాజకీయ నాయకుడని ఆరోపించారు. తన సొంత కూతురిని కూడా వదల్లేదని విమర్శించారు. ముందుగా ఆమె నుంచి కిడ్నీ తీసుకున్న లాలూ ఆ తర్వాత పార్టీ టికెట్ ఇచ్చాడని సామ్రాట్ చౌదరి అన్నారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. సామ్రాట్ చౌదరి వ్యాఖ్యలను ఆర్జేడీ ఖండించింది. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా కుష్వాహా వర్గాన్ని ఆయన అవమానిస్తున్నారని విమర్శించింది.
కాగా, లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన కుటుంబంతో కలిసి సింగపూర్లో నివసిస్తున్నది. 2022 డిసెంబర్లో తండ్రికి కిడ్నీ దానం చేసింది. సింగపూర్లోని ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. రోహిణి చాలా ఏళ్లుగా బీహార్కు దూరంగా ఉంది. అయితే ఇటీవల తల్లి రబ్రీ దేవి, తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, సోదరులు తేజ్ ప్రతాప్, తేజస్వీతో కలిసి ఆమె కనిపించింది.
మరోవైపు పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన ప్రతిపక్షాల జన్ విశ్వాస్ ర్యాలీలో రోహిణి పాల్గొన్నది. ఇండియా బ్లాక్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలలో రోహిణి పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. బీహార్లోని సరన్ సీటును ఆమెకు కేటాయించినట్లు తెలుస్తున్నది.
"लालू यादव ने अपनी बेटी तक को नहीं छोड़ा", पहले किडनी लिए तब टिकट दिया.
सोचिए कितने घिनौने हैं ये भाजपाई। ये बयान बिहार के डिप्टी CM सम्राट चौधरी का है। कितने कुकर्मी भरे हैं भाजपा में? pic.twitter.com/u5MzPJhsSf
— Naresh Balyan (@AAPNareshBalyan) March 22, 2024
"सम्राट चौधरी अनर्गल बयानबाज़ी कर कुशवाहा समाज को अपमानित कर रहे हैं। हमारा समाज ऐसी ओछी बयानबाजी का कभी पक्षधर नहीं रहा और ना ही ऐसी भाषा का कभी समर्थन करता है।"
– मधु मंजरी कुशवाहा जी। pic.twitter.com/5MeysntF81
— Rashtriya Janata Dal (@RJDforIndia) March 22, 2024