రాంచీ : దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదు సంవత్సరాల జైలు శిక్షణతో పాటు రూ.60లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దాణా కుంభకోణం కేసులో ఈ నెల 15న లాలూను న్యాయస్థానం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. దండోరా నుంచి రూ.139.35కోట్లు దుర్వినియోగం కేసు చివరి కేసు.
కేసుల్లో మొత్తం 170 మంది నిందితులు కాగా.. 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వానికి అప్రూవర్లుగా మారారు. మరో ఇద్దరు నేరాన్ని అంగీకరించగా.. ఆరుగురు పరారీలో ఉన్నారు. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూ సహా మొత్తం 99 మంది నిందితులపై ఫిబ్రవరి నుంచి విచారణ చేపట్టింది. 75 మందిని దోషులుగా నిర్ధారించగా.. 24 మందిని విడుదల చేసింది. ఇందులో 36 మందికి ఒక్కొక్కరికి మూడేళ్ల శిక్ష పడింది. మిగతా నిందితులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టు శిక్షణ ఖరారు చేస్తున్నది.
బిహార్కు లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉండగా.. రూ.950కోట్ల దాణా కుంభకోణం జరిగినట్లు ప్రధాన ఆరోపణ కాగా.. 1996 జనవరిలో వెలుగులోకి వచ్చింది. లాలూను నిందితునిగా పేర్కొంటూ 1997 జూన్లో సీబీఐ కేసు నమోదు చేయగా.. సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు విచారణ జరిగింది. లాలూతోపాటు బిహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా, పలువురు మంత్రులపై సీబీఐ అభియోగాలు మోపింది. దుమ్కా, దేవ్ఘడ్, ఛాయ్బసా ఖజానాల నుంచి నిధుల దుర్వినియోగానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు.
ఆయనకు మొత్తం 14 ఏళ్లు శిక్ష, రూ.60లక్షల జరిమానా పడింది. 2013 సెప్టెంబర్లో దోషిగా తేలడంతో లాలూ ప్రసాద్ యాదవ్ తొలిసారి రాంచీ జైలుకు వెళ్లారు. అదే సంవత్సరం 2013 డిసెంబర్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. 2017 డిసెంబర్లో మరో కేసులో దోషిగా తేలారు. ఆ సమయంలో లాలూ బిర్సా ముండా జైలుకు వెళ్లారు. 2021 ఏప్రిల్లో ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.