పాట్నా : తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ నుంచి బీహార్కు రా కుండా నలుగురైదుగు రు ఆపుతున్నారని, ఢిల్లీలోనే బంధించారని ఆయన కుమారుడు తేజ్ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. ఆర్జేడీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం కన్నేసిన వారే ఈ పనికి పూనుకొన్నారని పేర్కొన్నారు. తమ్ముడు తేజస్వి యాదవ్ను ఉద్దేశించే తేజ్ ప్రతాప్ ఈ వ్యా ఖ్యలు చేశారు. అయితే, తేజ్ ప్రతాప్ ఆరోపణలను తేజస్వి ఖండించారు. లాలూను ఎవ రూ బంధించలేరని వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన లాలూ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. అనారోగ్యం వల్ల ఢిల్లీలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు.